Impartial Judgement
నిష్పక్ష తీర్పు
- డానీ
కలియుగం కనుక ధర్మం ఒంటికాలి మీద సడుస్తోందట. ఈ మధ్య హైదరాబాద్లోరోడ్దుదాటుతుంటే ఓ కారుగుద్ది, ఆ ఒంటికాలు కూడా కుంటిదైపోయిందనిచూసినవాళ్ళు చెపుతున్నారు. అయినా ధర్మం గురించి మహానగరాల్లోమాట్లాడుకోవడం సమంజసం కాదుకనుక మనం ఇతర విషయాల వైపు మళ్ళితేబాగుంటుంది.
ఆ మధ్య, ఆకలితో నకనకలాడిపోతున్న కుర్రాడొకడు ఆమీర్ పేట సెంటర్లో రోడ్దుపక్కపునుగులు తిని, డబ్బులు ఇవ్వకుండా పారిపొయాడు. సైబరాబాద్ ఒబేసిటీ రన్ లోపాల్గొని వస్తున్న మెరికల్లాంటి కార్పోరేట్ కాలేజీ కుర్రాళ్ళు ఓ నలుగురు అప్పుడేఅక్కడికి చేరారు. వాళ్ళు, బహు సాహసోపేతంగా పరుగులు తీసి, ఆ పునుగులదొంగను పట్టుకుని, నాలుగు తన్ని, ఈడ్చుకువచ్చి, పునుగుల బండివాడికిఅప్పచెప్పారు.
అక్కడే ఓ విచిత్రం జరిగింది. పునుగుల బండివాడు ఆ పునుగుల దొంగను కసితీరాతంతాడనీ, ఆ తరువాత, తనివితీరా తిడతాడనీ, అందరూ అనుకున్నారు. కానీ,అతనా పని చెయ్యలేదు. పైగా, ఆ పునుగుల దొంగకు ఇంకో రెండు ప్లేట్లు పునుగులుఇచ్చి, ఆకలితీరా తినమన్నాడు. ఐదేళ్ల క్రితం తను కూడా ఆకలితోనే మెదక్ జిల్లానుండి ఇక్కడికి వచ్చి, అలా ఆమిర్ పేటలో స్థిరపడ్డానన్నాడు. పునుగుల దొంగఒప్పుకుంటే తన దగ్గర వంట అసిస్టెంటు అనబడే, ప్లేట్లు కడిగే ఉద్యోగం ఇస్తానన్నాడు.ఈ ప్రతిపాదన పునుగుల దొంగకు కూడా నచ్చింది. వెంటనే కొలువులో చేరిపోయాడు.వాళ్ళిద్దరూ ఆ గొడవని అలా శాంతియుతంగా పరిష్కారం చేసుకున్నారు.
స్కాములు, స్వాములూ, సానులు తప్ప మరోవార్త కవర్ చేయడానికి ఈమధ్యఅంతగా అవకాశం దొరకని మీడియావాళ్ళు మొత్తం కట్టకట్టుకుని ఈ పునుగుల దొంగమీద పడ్డారు. పునుగుల బండివాడి ఔదార్యాన్ని వంద కెమేరాలతో, రెండు వందలవిశ్లేషణలతో ప్రసారం చేశారు
ఉదయం సెషన్ కూ మధ్యాహ్నం సెషన్ కూ మధ్య లంచ్ సమయంలో పేషీ టివీలో’హల్లో డాక్టర్’ ప్రోగ్రాం చూస్తున్న హైకోర్టు న్యాయమూర్తులవారు ఒకరి దృష్టి ఆ బ్రేకింగ్న్యూస్ మీద పడింది. పునుగుల దొంగ కథనం విని వారు వెంటనే స్పందించారు.
ధర్మం హైదరాబాద్ రోడ్ల మీద ఒంటికాలితో కుంటుతూ నడుస్తోందిగానీ, హైకోర్టుఆవరణలో అది నాలుగు కాళ్లతో సంచరిస్తోంది. ధర్మాన్ని ఎవరు ఉల్లంఘించినా సరేవారికి శిక్షపడాల్సిందేనని భావించిన సదరు న్యాయమూర్తులంవారు, దొంగతనంచేసినందుకు పునుగుల దొంగ మీదా, ఒక దొంగకు ఆశ్రయం కల్పించినందుకుపునుగుల బండివాడి మీదా సూమోటోగా కేసులు నమోదు చేయాలని ఆమీర్ పేటపోలీసు స్టేషనుకు తాఖీదు పంపించారు
అలా మొదలైన ఆ కేసు చాలా వేగంగా ముందుకు కదిలి, హైకోర్టు ఫుల్ బెంచి ధర్మాసనం ముందు తీర్పు వరకు వచ్చేసింది. తీర్పు చెప్పే ముందు, ధర్మాసనంలోనిన్యాయమూర్తులందరూ పునీతులవ్వాలనిన్నూ, ఆత్మప్రక్షాళన చేసుకోవాలనిన్నూ,నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలనిన్నూ ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.
"ఈ యొక్క పునుగుల వ్యాపారంలో మీలో ఎవరికైనా, ఏ విధమైన ఆసక్తిగానీవుందా?" అని ప్రధాన న్యాయమూర్తి అడిగారు.
"లేదు" అని ధర్మాసనంలోని న్యాయమూర్తులందరూ ముక్తకంఠంతో చెప్పారు.
"మీలో ఎవరైనాగానీ, ప్రైమరీ మార్కెట్లోగానీ, సెకండరీ మార్కెట్లోగానీ, ఈ యొక్కపునుగుల బండిలో షేర్లు కొన్నారా?"
"లేదు. లేదు"
"ఈ పునుగుల బండివాడితోగానీ, ఆ పునుగుల దొంగతోగానీ, మీకెవరికైనాబంధుత్వాలుగానీ, స్నేహాలుగానీ, రాగద్వేషాలుగానీ వున్నాయా?"
"లేదు. లేదు. లేదు".
"మీలో ఎవరైనా ఎప్పుడయినా అటుగా వెళుతూ, ఆ ఆమీర్ పేట సెంటర్లో ఈ యొక్కపునుగుల బండి దగ్గర ఆగి, ఏవైనా తినడంగానీ, తాగడంగానీ చేశారా?"
"లేదు. లేదు. లేదు. లేదు".
ధర్మాసనంలోని న్యాయమూర్తుల సమాధానాలతో సంతృప్తి చెందిన ప్రధానన్యాయమూర్తులవారు, వాళ్లను ఇక తీర్పు చెప్పాల్సిందిగా కోరారు.
అప్పుడు ఆ న్యాయమూర్తులందరూ ముక్తకంఠంతో పునుగుల బండివాడికీ,పునుగుల దొంగకూ చెరో ఆరేళ్ళ కఠినకారాగార శిక్షను విధించారు.
ఆ తరువాత, హైకోర్టు ఆవరణలో ధర్మం దర్జాగా వెయ్యి కాళ్లతో సంచరించడంమొదలెట్టింది.
(కక్షిదారులతో భావబంధాలున్న న్యాయమూర్తులు కేసుల్ని విచారించడం సమంజసంకాదన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగారికి అభినందనలతో)
హైదరాబాద్
11 - 12 - 2011
సూపర్ గా ఉంది డానీ జీ
ReplyDelete