Thursday, 14 May 2015

Impartial Judgement

Impartial Judgement

నిష్పక్ష తీర్పు
డానీ

కలియుగం కనుక ధర్మం ఒంటికాలి మీద సడుస్తోందట మధ్య హైదరాబాద్లోరోడ్దుదాటుతుంటే  కారుగుద్ది ఒంటికాలు కూడా కుంటిదైపోయిందనిచూసినవాళ్ళు చెపుతున్నారుఅయినా ధర్మం గురించి మహానగరాల్లోమాట్లాడుకోవడం  సమంజసం కాదుకనుక మనం ఇతర విషయాల వైపు మళ్ళితేబాగుంటుంది.

 మధ్యఆకలితో నకనకలాడిపోతున్న కుర్రాడొకడు ఆమీర్ పేట సెంటర్లో రోడ్దుపక్కపునుగులు తినిడబ్బులు ఇవ్వకుండా పారిపొయాడుసైబరాబాద్ ఒబేసిటీ రన్ లోపాల్గొని వస్తున్న  మెరికల్లాంటి కార్పోరేట్ కాలేజీ కుర్రాళ్ళు  నలుగురు అప్పుడేఅక్కడికి చేరారు.  వాళ్ళుబహు సాహసోపేతంగా పరుగులు తీసి పునుగులదొంగను పట్టుకునినాలుగు తన్నిఈడ్చుకువచ్చిపునుగుల బండివాడికిఅప్పచెప్పారు

అక్కడే  విచిత్రం జరిగిందిపునుగుల బండివాడు  పునుగుల దొంగను కసితీరాతంతాడనీ తరువాత,  తనివితీరా తిడతాడనీ,  అందరూ అనుకున్నారు.  కానీ,అతనా పని చెయ్యలేదుపైగా పునుగుల దొంగకు ఇంకో రెండు ప్లేట్లు పునుగులుఇచ్చిఆకలితీరా తినమన్నాడు.  ఐదేళ్ల క్రితం తను కూడా ఆకలితోనే మెదక్ జిల్లానుండి ఇక్కడికి వచ్చిఅలా ఆమిర్ పేటలో స్థిరపడ్డానన్నాడుపునుగుల దొంగఒప్పుకుంటే తన దగ్గర వంట అసిస్టెంటు అనబడేప్లేట్లు కడిగే ఉద్యోగం ఇస్తానన్నాడు. ప్రతిపాదన పునుగుల దొంగకు కూడా నచ్చిందివెంటనే కొలువులో చేరిపోయాడు.వాళ్ళిద్దరూ  గొడవని అలా శాంతియుతంగా పరిష్కారం చేసుకున్నారు.
స్కాములుస్వాములూసానులు తప్ప మరోవార్త కవర్ చేయడానికి ఈమధ్యఅంతగా  అవకాశం దొరకని మీడియావాళ్ళు మొత్తం కట్టకట్టుకుని  పునుగుల దొంగమీద పడ్డారుపునుగుల బండివాడి ఔదార్యాన్ని వంద కెమేరాలతోరెండు వందలవిశ్లేషణలతో ప్రసారం చేశారు
ఉదయం సెషన్ కూ మధ్యాహ్నం సెషన్ కూ మధ్య లంచ్ సమయంలో పేషీ టివీలోహల్లో డాక్టర్’ ప్రోగ్రాం చూస్తున్న హైకోర్టు న్యాయమూర్తులవారు ఒకరి దృష్టి  బ్రేకింగ్న్యూస్ మీద పడిందిపునుగుల దొంగ కథనం విని వారు వెంటనే స్పందించారు.

ధర్మం  హైదరాబాద్ రోడ్ల మీద ఒంటికాలితో కుంటుతూ నడుస్తోందిగానీహైకోర్టుఆవరణలో అది నాలుగు కాళ్లతో సంచరిస్తోందిధర్మాన్ని ఎవరు ఉల్లంఘించినా సరేవారికి శిక్షపడాల్సిందేనని భావించిన సదరు న్యాయమూర్తులంవారుదొంగతనంచేసినందుకు పునుగుల దొంగ మీదాఒక దొంగకు ఆశ్రయం కల్పించినందుకుపునుగుల బండివాడి మీదా సూమోటోగా కేసులు నమోదు చేయాలని ఆమీర్ పేటపోలీసు స్టేషనుకు తాఖీదు పంపించారు

అలా మొదలైన  కేసు చాలా వేగంగా ముందుకు కదిలి,  హైకోర్టు ఫుల్ బెంచి ధర్మాసనం ముందు తీర్పు వరకు వచ్చేసిందితీర్పు చెప్పే ముందుధర్మాసనంలోనిన్యాయమూర్తులందరూ పునీతులవ్వాలనిన్నూఆత్మప్రక్షాళన చేసుకోవాలనిన్నూ,నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలనిన్నూ ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.  

" యొక్క పునుగుల వ్యాపారంలో మీలో ఎవరికైనా విధమైన ఆసక్తిగానీవుందా?" అని ప్రధాన న్యాయమూర్తి అడిగారు.
"లేదుఅని ధర్మాసనంలోని న్యాయమూర్తులందరూ ముక్తకంఠంతో చెప్పారు.
"మీలో ఎవరైనాగానీప్రైమరీ మార్కెట్లోగానీసెకండరీ మార్కెట్లోగానీ యొక్కపునుగుల బండిలో షేర్లు కొన్నారా?"
"లేదులేదు"
" పునుగుల బండివాడితోగానీ పునుగుల దొంగతోగానీమీకెవరికైనాబంధుత్వాలుగానీస్నేహాలుగానీరాగద్వేషాలుగానీ వున్నాయా?"
"లేదులేదులేదు".
"మీలో ఎవరైనా ఎప్పుడయినా అటుగా వెళుతూ ఆమీర్ పేట సెంటర్లో  యొక్కపునుగుల బండి దగ్గర ఆగిఏవైనా తినడంగానీతాగడంగానీ చేశారా?"
"లేదులేదులేదులేదు".

ధర్మాసనంలోని న్యాయమూర్తుల సమాధానాలతో సంతృప్తి  చెందిన ప్రధానన్యాయమూర్తులవారు,  వాళ్లను ఇక  తీర్పు చెప్పాల్సిందిగా కోరారు.
అప్పుడు  న్యాయమూర్తులందరూ ముక్తకంఠంతో పునుగుల బండివాడికీ,పునుగుల దొంగకూ చెరో ఆరేళ్ళ కఠినకారాగార శిక్షను విధించారు
 తరువాతహైకోర్టు ఆవరణలో ధర్మం దర్జాగా వెయ్యి కాళ్లతో సంచరించడంమొదలెట్టింది.

(కక్షిదారులతో భావబంధాలున్న న్యాయమూర్తులు కేసుల్ని విచారించడం సమంజసంకాదన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగారికి అభినందనలతో)

హైదరాబాద్
11 - 12 - 2011 

1 comment:

  1. సూపర్ గా ఉంది డానీ జీ

    ReplyDelete